ఈ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న ‘వీరసింహారెడ్డి’

-

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. తాజాగా ఈ చిత్రం నేటితో వంద రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది.

Veera Simha Reddy (2023) Movie: Cast | Trailer | OTT | Songs | Release Date  - News Bugz

హిందూపురం .. చిలకలూరి పేట .. ఆలూరు .. ఆదోని సెంటర్స్ లో రోజుకి నాలుగు ఆటల చొప్పున ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకుంది. అందుకు సంబధించిన వివరాలతో తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన 18వ సినిమా ఇది. ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయగానే ఒక నిమిషంలో లక్షా యాభై వేల యూనిక్ వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డును సృష్టించింది. బాలయ్య కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో ఈ సినిమా చేరింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news