కేసీఆర్ ను ప‌ర్మినెంట్‌గా ఫామ్ హౌస్‌కి పంపించడం ఖాయం – విజ‌య‌శాంతి

-

కేసీఆర్ సారును త్వరలోనే తెలంగాణ ప్ర‌జలు ప‌ర్మినెంట్‌గా ఫామ్ హౌస్‌కి పంపించడం ఖాయమని హెచ్చరించారు విజ‌య‌శాంతి. తెలంగాణలో నిరంకుశ ప్ర‌భుత్వం రాజ్య‌మేలుతోంది. కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా పేదోళ్ల‌కు ఆన్యాయమే జరుగుతోంది. తాజాగా… ఈ స‌ర్కార్ అమాయకులైన ఆదివాసీల‌పైన ప‌డిందని ఆగ్రహించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి ప్ర‌భుత్వం పేదలకు భూములిస్తే… కేసీఆర్ ప్రభుత్వం వాటిని లాక్కుంటోంది. పేదల భూములను లాక్కోవాలనుకోవడం పరమ దారుణమని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరగడంలేదు. పోడు భూములకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్పి… దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ స‌ర్కార్ నుంచి ఎలాంటి ఉలుకుప‌లుకు లేదని నిప్పులు చెరిగారు. అడవులను రక్షిస్తున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడటం దుర్మార్గం. పుల్లలేరుకోడానికి వెళ్లిన ఆదివాసీ మహిళలను… పసిపిల్లలున్నారనే కనికరం కూడా లేకుండా జైల్లో పెట్టారన్నారు.

ఏం కేసీఆర్…. తెలంగాణ ఏమైనా నీ జాగీరు అనుకుంటున్నవా? ఆదివాసీలపై దాడులను ఆపకపోతే ప్రజలే తిరగబడతరు. వారే నీకు త‌గిన బుద్ధి చెప్తరు. ఎకరం పోడు భూమిని కూడా పోనియ్యబోమని ఆదివాసీ బిడ్డ‌ల‌కు బీజేపీ పార్టీ త‌రుపున‌ భరోసా ఇస్తున్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చాక పోడు భూములకు పట్టాలు ఇస్తాం. ఈ దగాకోరు స‌ర్కార్‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. కేసీఆర్ సారును త్వరలోనే తెలంగాణ ప్ర‌జలు ప‌ర్మినెంట్‌గా ఫామ్ హౌస్‌కి పంపించడం ఖాయమని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news