విద్యార్థినుల వేదన ఈ పాలకుల పాలిట శాపం కాక తప్పదు – విజయశాంతి

-

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. షీ టీమ్స్ అంటూ గొప్పలు చెప్పుకునే తెలంగాణ పాలకులు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

“అడపిల్లల మర్యాద కాపాడలేరు గాని, షీ టీమ్స్ అంటూ గొప్పలు చెప్పుకునే తెలంగాణ పాలకులు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌లో నెలకొంది. సుమారు 100 మందికి పైగా బాలికలున్న ఆ బడిలో మరుగుదొడ్లు కూలిపోయి ఆ బిడ్డలు నానా అవస్థలు పడుతున్నరు. పరదాలు కట్టుకుని క్యూలో నిలబడి చెప్పుకోలేని ఇబ్బందులు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటు. అర్జెంటుగా మరుగుదొడ్లు కట్టించండి మహాప్రభూ అని గగ్గోలు పెడుతుంటే, లక్షల రూపాయల నిధులున్నా… ఆ పనులు పక్కన పెట్టేసి, ఇతర నిర్మాణ పనులు చెపడుతున్నరు. ఈ విద్యార్థినుల వేదన ఈ పాలకుల పాలిట శాపం కాక తప్పదు” అన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news