Vinod Kumar : కేసీఆర్‌ పాలనలో ఎంతో ప్రగతి సాధించాం : మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

-

పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కేసీఆర్‌ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు .కరీంనగర్‌ క్యాంపు ఆఫీసులో కొత్త సంవత్సర వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిపేసిన ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తి చేసి, ప్రతి ఎకరాకు గోదావరి జలాలను ఇచ్చిందని అన్నారు.

తెలంగాణలో 2014 కంటే ముందు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి .కానీ ఇప్పుడు 25 వేల మెగావాట్లకు పెంచామనీ తెలిపారు. ఐటీ పరిశ్రమలు, పారిశ్రామిక రంగాలను కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి చేశామని తెలిపారు. నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నామన్నారు.

 

ఈ కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు,మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, నాయకులు మధుసూదన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, స్వర్ణలత, గజ్జెల దేవరాజు,రాజనర్సింగరావు, కొండయ్య, గందె కల్పన,మల్లెంకి శ్రీనివాస్‌, వైజయంతి సాయికృష్ణ పాల్గొన్నారు.

అలాగే జిల్లా లోని పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త సంవత్సరం 2024 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version