బీజేపీ కోసం సీట్లు తగ్గించుకున్నాం: జనసేనాని పవన్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడుత అభ్యర్థులను ప్రకటించారు. తొలుత కేవలం ఐదుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేసింది జనాసేన పార్టీ . 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… బీజేపీని దృష్టిలో పెట్టుకుని జనసేన సీట్లను తగ్గించుకున్నామని తెలిపారు. ‘జనసేన కార్యకర్తలందరికీ చెబుతున్నా. టీడీపీతో కూటమి బలంగా ఉండాలంటే సొంత ప్రయోజనాలను పక్కన పెట్టాలి అని అన్నారు. మన ఓటు టీడీపీకి వెళ్లడం ఎంత ముఖ్యమో, టీడీపీ ఓటు మనకు రావడమూ అంతే ముఖ్యం అని గుర్తు చేశారు. జగన్.. సిద్ధం సిద్ధం అని చావగొడుతున్నావు నీకు యుద్ధం ఇస్తాం. మేం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. గెలుస్తున్నాం’ అని వెల్లడించారు.

ఇక తాజాగా ప్రకటించిన అభ్యర్థుల వివరాలను చూస్తే… తెనాలి- నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల- లోకం మాధవి, అనకాపల్లి- కోణతాల రామకృష్ణ, రాజానగరం-బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీలను ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version