ఆ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం – రాజగోపాల్ రెడ్డి

-

నల్లగొండ జిల్లా మునుగోడు లో మాజీ ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు విషయంలో అనవసరంగా టిఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు ఉంటే తప్పేంటి? పని ప్రశ్నించారు. మీటర్లు ఉన్నా చార్జీలు వసూలు చేయడం లేదని ఏపీ సీఎం జగన్ చెప్పారని.. ఆ విషయంలో జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. డిస్కౌమ్ లను కాపాడుకోవడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు రాజగోపాల్ రెడ్డి.

మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడ అధికారికంగా చెప్పలేదన్నారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళుతుందని ఆరోపించారు. సంక్షోభం నుండి విద్యుత్ రంగాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. మోటార్లకు మీటర్లు అంటూ టిఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news