నేడు హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా..కేసీఆర్ కీలక ప్రకటన !

-

నేడు హైదరాబాదుకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రానున్నారు. ఉదయం 11 గంటలకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట్ ఎయిర్పోర్టులో ఆయనకు స్వాగతం పలుకుతారు. 11 గంటలకి బేగంపేట్ నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనుంది.


12:30 కి బేగంపేట జలవిహార్ లో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. కాగా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. నామినేషన్‌ వేసిన రోజున టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున స్వయంగా కేటీఆర్‌.. ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం.. హైదరాబాద్‌ నగరానికి రావాలని కోరారు. కాగా.. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version