ప్రభుదేవా ‘ప్రేమికుడు’ చిత్ర షూటింగ్‌కు గవర్నర్ అభ్యంతరం..చివరకు ఏం జరిగిందంటే?

-

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా..మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అందరకీ తెలుసు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్, యాక్టర్, డైరెక్టర్, హీరో అయిన ప్రభుదేవా..ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో చేసిన సినిమా ‘ప్రేమికుడు’.నగ్మ హీరోయిన్ గా నటించిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో గవర్నర్ కూతురిగా నగ్మ నటిస్తుంది. ప్రొడ్యూసర్ కుంజుమన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇంతకు ముందు శంకర్ తో తొలి సినిమా ‘జెంటిల్ మెన్’ తీసిన కుంజుమన్..లవ్ స్టోరి అయిన ‘ప్రేమికుడు’ తీశారు.

‘ప్రేమికుడు’ సినిమాలో గవర్నర్ కుట్రలు చేస్తాడనే విషయం సినిమా షూటింగ్ సందర్భంలో గవర్నర్ కార్యాలయానికి వెళ్లిందట. దాంతో గవర్నర్ ఆఫీసు నుంచి షూటింగ్ ఆపేయాలని ప్రొడ్యూసర్ కు , మూవీ యూనిట్ కు వార్నింగ్స్ వచ్చాయని సమాచారం.

అప్పుడు గవర్నర్ గా చెన్నారెడ్డి ఉన్నారు. తమిళనాడు సీఎంగా జయలలిత ఉండగా, ఆమె వద్దకు మేకర్స్ వెళ్లారట. అప్పుడు సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు పెట్టొద్దని చెప్తూ సీఎం అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. అలా సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, ఆ తర్వాత ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news