ఏపీలో కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్క రోజే..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, గడచిన 24 గంటల్లో కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 605 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,489కి చేరింది. కరోనాతో 10 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 146కు పెరిగింది. ఇక కొత్తగా 191 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,196గా ఉంది. ప్రస్తుతం 6,147 మంది చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news