జగన్ రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే – అచ్చెన్నాయుడు

-

జగన్ రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే అంటూ విమర్శలు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్ 1. కేంద్రాన్ని మోసం చేస్తున్నారు, కాగ్ ను మోసం చేస్తున్నారు, కోర్టులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

అన్నిటికంటే ముఖ్యంగా నమ్మి ఓట్లు వేసిన ప్రజలనే మోసం చేస్తున్నారు. తాత్కాలికంగా మీ మోసాలు బయటపడక పోవచ్చు.. కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించిన రోజు, ప్రజల ఆస్తులు కరిగించేసి, కొండల్ని మింగేసి, ప్రజల నెత్తిపై లక్షలాది రూపాయల అప్పు పెట్టి పోయిన జగన్ రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే అంటూ విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు.

జేసీ అస్మిత్ రెడ్డిపై దాడి పిరికిపందల చర్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకం అయ్యింది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అధికార బలంతో అడ్డుకోవడం, ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాదరణతో.. అధికార బలం సరిపోని పక్షంలో, రౌడీయిజాన్ని,అస్మిత్ రెడ్డిపై జరిగిన దాడి వైసీపీ ఫ్యాక్షన్ స్వభావాన్ని మరోసారి రుజువు చేసింది. ఓడిపోతున్నాం అన్న నిస్పృహతో వైసీపీ చేస్తున్న అరాచకాలను క్షేత్ర స్థాయిలో, న్యాయపరంగా ధీటుగా ఎదుర్కుంటాం. బెదిరింపులతో, దాడులతో తెలుగుదేశం పార్టీని నిలువరించగలం అనుకోవడం వైసీపీ కంటున్న పగటి కల అంటూ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news