నేడు తిరుపతి, శ్రీకాళహస్తిలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

-

అమరావతి : నేడు ఆంధ్ర ప్ర దేశ్‌ రా ష్ట్ర సీఎం వైయస్‌ జగన్‌ తిరుపతి జిల్లా అలాగే.. శ్రీకాళహస్తి లో పర్యటించనున్నారు. ఇందు లో భాగం గానే.. నేడు ఉదయం 09.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదే రనున్న సీఎం జగన్‌… 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకోనున్నారు. 11.15 – 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలలో పాల్గొననున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.


12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌.. హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకోనున్న సీఎం.. ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక నేడు తిరిగి సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news