BREAKING : అదుపుతప్పి ఢీకొట్టిన సజ్జల కాన్వాయ్..తప్పిన ప్రమాదం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సజ్జల రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ లు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. కర్నూలు నగరం లోని ఓ ఫ్లైఓవర్‌పై… ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి కాన్వాయ్ వాహనాలు అదుపు తప్పి ఒకదాని కొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు కాన్వాయ్‌లు.. తుక్కు తుక్కు అయ్యాయి.

అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ నేత వివాహానికి హాజరై..ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్ గెస్ట్ హౌస్‌ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

డ్రైవర్లు అతి వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం అందుతోంది. ఇక… ఈ రోడ్డు ప్రమాదం లో ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఇతరులు సురక్షితంగా బయట పడటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news