‘మిస్ సౌత్ ఇండియా’గా.. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిని

-

చదువుతో పాటు.. అందం.. అభినయంతో మన తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. తాజాగా.. తెలుగు విద్యార్థిని మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినికి ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం దక్కింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు.

ఎపిపిజిఇసెట్‌ - 2022 ఫలితాలు విడుదల | Prajasakti

 

ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యువతులు హాజరయ్యారు. అందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా విజేతగా నిలిచారు. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్నారు. కాగా, ఈ పోటీలో తమిళనాడుకు చెందిన దేబ్‌నితా కర్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, కర్ణాటకకు చెందిన సమృద్ధి శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచింది.
 

Read more RELATED
Recommended to you

Latest news