వాట్సాప్‌ తో జగన్ సర్కార్ కీలక ఒప్పందం..ఇక ప్రభుత్వ వివరాలు అందులోనే !

-

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సోషల్‌ మీడియా దిగ్గజమైన వాట్సాప్‌ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది జగన్‌ సర్కార్‌. ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిన్న వాసుదేవ రెడ్డి గురువారం.. రాత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఏపీ ప్రభుత్వంతో కలిసి.. వాట్సాప్‌ పని చేయనుందన ఆయన ప్రకటించారు.

ఏపీ సర్కార్‌ తరఫున ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వంతో.. కలిసి వాట్సాప్‌ పని చేయనుందని వాసుదేవ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని.. ఆయన తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన విషయంతో.. పాటు ఈ ఒప్పందం ద్వారా ఎలాంటి ప్రయోజనం దక్కనుందన్న విషయంపై వాసుదేవ రెడ్డి.. ఓ ప్రకటన విడుదల చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news