అమిత్​షా సభతో చరిత్ర సృష్టిద్దాం : బండి సంజయ్

-

ప్రజా సంగ్రామ యాత్ర- ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య​అతిథిగా హాజరవుతున్నందున గ్రాండ్ సక్సెస్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిద్దామని పార్టీ నేతలకు తెలంగాణ బీజేపీ చీఫ్ సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లపై గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు, ఇతర పార్టీ నేతలతో ఆయన సోమవారం జడ్చర్ల మండలం మక్తపల్లి గేట్ వద్ద లంచ్ శిబిరంలో సమావేశమయ్యారు.

Will the 2nd phase of Bandi Sanjay Kumar's Yatra be a defining moment for  BJP?

టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు సంకేతంగా పాదయాత్ర ముగింపు సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని బండి సంజయ్ నేతలు సూచనలు చేశారు. సభ ఏర్పాట్లు, వివిధ అంశాలపై కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. అయితే ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానుండడంతో.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news