పవన్‌ను తిట్టించేందుకు మంత్రులతో ప్రెస్‌ కాన్ఫరెన్సులు – నాదెండ్ల

-

వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌. సమాజంలో అలజడి సృష్టించేలా సీఎం జగన్‌ కామెంట్లు చేస్తున్నారని.. పవన్‌ను ఉద్దేశించి సీఎం జగన్‌ కామెంట్లు బాధాకరమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్‌. పవన్‌ కళ్యాణ్‌ ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేశారని.. గతంలో పవన్‌ను తిట్టించేందుకు మంత్రులతో ప్రెస్‌ కాన్ఫరెన్సులు పెట్టించారని మండిపడ్డారు.

ఇప్పుడా మంత్రులు పదవులు కొల్పోయారని.. పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే సమయాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాలని చురకలు అంటించారు. ఇప్పుడు కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు కూడా పవన్‌ పైనే కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టి హోల్‌ సేల్‌గా అమ్ముడు పోయింది వైసీపీనేనని ప్రజలందరికీ అర్థమైందని ఆగ్రహించారు. బటన్‌ నొక్కడమే మానవత్వమా..? జగన్‌పై ఫైర్‌ అయ్యారు.

బటన్‌ నొక్కి వారికి వారే చప్పట్లు కొట్టేసుకుంటున్నారని.. కోనసీమ అల్లర్ల వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసన్నారు. వరదల సమయంలో ప్రభుత్వ సాయం ఏంటో అర్థమవుతోందని.. ముందుగా నిర్ణయించిన వారినే సీఎం జగన్‌ కలిసి వరద పర్యటనను ముగించారని ఆగ్రహించారు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.

Read more RELATED
Recommended to you

Latest news