Breaking : రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌..

-

టీఆర్‌ఎస్‌ పేరు బీఆర్‌ఎస్‌గా అధికారికంగా మారిన తరువాత మొదటి సారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ నెల 14న ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్​ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే నిన్న మంత్రి నిరంజన్​ రెడ్డి, ఎంపీ సంతోష్​ కుమార్​లు ఢిల్లీలో 14వ తేదీకి సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకోవడానికి వెళ్లారు. మంత్రులంతా.. ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలని సీఎం కేసీఆర్​ నిన్న ఆదేశించారు. 14 తర్వాత పార్టీపరంగా జాతీయ అంశాలపై దృష్టి సారిస్తారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను ఢిల్లీలో ఎండగట్టే విధంగా విధానాలను రూపొందించుకుంటున్నారు.

Delhi : హైదరాబాద్‌కు వచ్చేసిన సీఎం కేసీఆర్ | CM KCR Delhi Tour End

ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలపై నిర్ణయం తీసుకుందామని మంత్రులతో సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్​ఎస్​) పేరు భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్​ఎస్​ ఆవిర్భావానికి సంబంధించి ఈసీ పంపిన లేఖపై 9వ తేదీన కేసీఆర్‌ సంతకం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news