తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. కన్న తండ్రిపై అఘాయిత్యం

-

మద్యం ఎన్నో అనార్థలకు కారణమవుతుంది. మత్తులో కన్నుమిన్ను కానక హత్యలు, అత్యచారాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులను సైతం కడ తేర్చుతున్నారు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలేదని కన్న తండ్రిపై వంట నూనె పోసి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. తీవ్రంగా గాయపడిన ఆ తండ్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దుర్గారావు(55), లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. గచ్చిబౌలిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా దుర్గారావు పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. తాగుడుకు బానిసైన పెద్ద కొడుకు నాగబాబు(35) మంగళవారం డబ్బులు కావాలని అడిగాడు. ఇవ్వకపోవడంతో తండ్రితో ఘర్షణకు దిగాడు. చివరికి విచక్షణ కోల్పోయిన నాగబాబు కన్న తండ్రి దుర్గారావు, ఇంట్లోని సామగ్రిపై వంట నూనె పోసి నిప్పంటించి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన దుర్గారావును ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news