కొత్త జిల్లాలపై జగన్ కీలక ఆదేశాలు..ప్రతి జిల్లాలో 15 ఎకరాలు కేటాయించండి !

-

అమరావతి : జిల్లాల పునర్విభజన పై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలని పేర్కొన్నారు.

సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని.. కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలని వెల్లడించారు.

అంతే కాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలని.. ఈ భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపికచేసుకోవాలని స్పష్టం చేశారు. పది కాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని.. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు. దీనిపై ఎక్కడా తగ్గవద్దని చెప్పారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news