నన్ను ప్రధానిని చేస్తే దేశ, దశ మార్చి చూపిస్తా – కేఏ పాల్‌

-

నన్ను ప్రధానిని చేస్తే దేశ, దశ మార్చి చూపిస్తానని పేర్కొన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చలేదు..శ్రీలంక రాజపక్సే తో సన్నిహిత సంభందాలు ఉన్నాయి.. అయినా కుటుంబ పాలన వద్దని చెప్పానని వెల్లడించారు. ఏపీకి అప్పులు భారంగా మారనున్నాయి.. ప్రస్తుతం ఉన్న పార్టీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆగ్రహించారు.

తెలంగాణాలో నేతలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం తోనే సరిపోతుంది..తెలుగు రాష్ట్రాలను రక్షించుకోలేక పోతే దేశాన్ని కూడా రక్షించుకోలేమని తెలిపారు. ఏపీకి ఏమి చేయని బీజేపీతో జనసేన పొత్తులు పెట్టుకుంటుంది.. వైసీపీ ఏది అడిగితే అది చేస్తుందని వెల్లడించారు. ఏపీలో ఎకనమిక్ సమిట్ పెట్టాలని మోదీని కలుద్దామంటే ఇక్కడి నేతలు కలసి రావటం లేదు..రాజకీయ నేతలందరూ రాజీనామాలు చేసి నాతో కలిసి వస్తే అన్నీ సాధిస్తామని ప్రకటించారు.

ఐదేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అప్పులు చేసి ఈ సీఎంకు ఇచ్చారు.. సీఎం జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదన్నారు. కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమి అడగటం లేదు..కొడుకుని సీఎంని చేసి తాను పీఎం కావాలని గత ఎన్నికల్లో చంద్రబాబు తిరిగారని పేర్కొన్నారు.
పీఎం కావాలని కేసీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు..చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ తోడు దొంగలు అని ఆగ్రహించారు కేఏ పాల్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news