విద్యార్థులను స్వీపర్లుగా మార్చేసారు కంస మామ జగన్ రెడ్డి : నారా లోకేష్

-

విద్యార్థులను స్వీపర్లుగా మార్చేసారని కంస మామ జగన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. నాడు చక్కగా చదువుకున్న విద్యార్థులను నేడు స్వీపర్లుగా మార్చేసారు కంస మామ జగన్ రెడ్డి. నిర్వహణ ఖర్చులంటూ అమ్మ ఒడిలో రూ.2 వేలు కొట్టేస్తూ పిల్లలతో పాఠశాలలు శుభ్రం చేయించడం దారుణమని ఫైర్ అయ్యారు లోకేష్.

బాలల హక్కులను కాలరాసే విధంగా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పి పాఠశాలలో నెలకొన్న దుస్థితే రాష్ట్ర వ్యాప్తంగానూ ఉంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థకు శనిలా దాపురించారని జగన్ రెడ్డి పై మండిపడ్డారు.

అస్తవ్యస్త విలీన ప్రక్రియతో స్కూళ్ల మూసివేత, విద్యా సంవత్సరం మొదలైనా అందుబాటులో లేని పుస్తకాలు, ఉపాధ్యాయులకు వేధింపులు, విద్యార్థులతో పనులు చేయించడం చూస్తుంటే ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని విమర్శలు చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news