Chandrababu : వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు.. పథకాలకు కోతలు

-

పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కెక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. అమరావతిని స్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్ముతుంది..? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా.. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తారా..? అని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు.. పథకాలకు కోతలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అమ్మఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గించారని, ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసుని 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం దారుణమన్నారు.

Chandrababu : చిత్తూరు మాజీ మేయర్‌ ఘటనపై.. డీజీపీకి చంద్రబాబు లేఖ.. - NTV  Telugu

నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. డబ్బులు పంచినా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పెరగలేదని ఆయన సెటైర్లు వేశౄరు. డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా వైసీపీకి ఓట్లు పెరగలేదని, గత ఎన్నికలకు, ఉప ఎన్నికలకు చూస్తే కనీసం వైసీపీకి 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదన్నారను. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని, పంటల బీమా సాయంలో అసలైన రైతులకు లబ్ధి జరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news