Trs అంటే..తేజ, రాజేష్ , శ్రీధర్ గా మారిపోయింది – రేవంత్

-

Trs పేరు మార్చుకోవాలని.. Trs అంటే..తేజ, రాజేష్ , శ్రీధర్ గా మారిపోయిందని కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  తేజ, రాజేష్ , శ్రీధర్ కేటీఆర్‌ బీనామీలు అని రేవంత్ ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీ కి రావద్దు అంటారా..? అని ప్రశ్నించారు. విద్యార్ధులకు మీరు గొప్పగా చేస్తే చర్చకు రావాలని.. ఆర్ట్స్ కాలేజి ముందు చర్చకు కాంగ్రెస్ నుండి ఇద్దరం వస్తామని పేర్కొన్నారు.

హరీష్..కేటీఆర్ ఆర్ట్స్ కాలేజి కి రావాలని ఛాలెంజ్‌ విసిరారు. trsలో అమర వీరులు ఎక్కడ ఉన్నారని.. తొలి అమర వీరుడు శంకరమ్మ ఎక్కడ ఉంది..? అని నిలదీశారు. యూనివర్సిటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఆలోచన అయినా చేశారా..? రాహుల్ గాంధీ వస్తె మీకు వచ్చిన నష్టం ఎంటి అని నిలదీశారు. రాహుల్ గాంధీ..నేను వస్తాం.. Trs నుండి కెసిఆర్..కేటీఆర్ యూనివర్సిటీ కి వస్తారా..? అని సవాల్‌ విసిరారు రేవంత్‌ రెడ్డి. అర్స్ట్స్ కాలేజీ ముందు చర్చ కు రావాలని.. జనమే ఎవరిని భుజాల ఎత్తుకుంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news