జగన్‌కు అందరూ దూరమయ్యారు.. ప్లీనరీ ఓ డ్రామా : సోమిరెడ్డి

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోలిట్‌ బ్యూర్‌ సభ్యుడు సోడిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ను విజయమ్మ, షర్మిల, కేవీపీ, సూరీడు ఎవరూ నమ్మట్లేదని, పార్టీకి విజయమ్మ సెలవు చీటీ ఇచ్చేశారని, చెల్లి షర్మిల అన్న ముఖం చూడకూడదని మరో రాష్ట్రానికి వెళ్లిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ విడిచిన బాణం అని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమె ఇప్పుడు దూరమైందని సోమిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్ ఆత్మగా భావించే కేవీపీ మిమ్మల్ని ఏ పార్టీ జైలుకు పంపించిందని అనుకుంటున్నారో ఆ పార్టీలో ఉన్నాడు అని, వైఎస్సార్ నీడ అని సూరీడు గురించి చెబుతారు… ఇప్పుడా నీడ మాయమైపోయిందంటూ వ్యాఖ్యానించారు సోమిరెడ్డి.

TDP Somireddy Chandramohan Reddy: Telangana government flayed for blocking  works of Pothireddypadu

మరో చెల్లి సునీత అయితే జగన్ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడంలేదంటూ.. ఇప్పుడు మిమ్మల్ని కుటుంబ సభ్యులు, ఆత్మీయులే నమ్మనప్పుడు ప్రజలెందుకు నమ్మాలి? అని ప్రశ్నించారు సోమిరెడ్డి. ఆత్మస్తుతి, పరనింద తప్ప ప్లీనరీలో ఏముందని, మంత్రులు, ఇతర నేతలతో పొగిడించుకోవడానికి, విపక్ష నేతలను విమర్శించడానికే ప్లీనరీ నిర్వహించారని, ఈ ప్లీనరీ ఓ డ్రామా అని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news