ఏపీలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్యలో ట్విస్ట్… ఆ కారణంతోనే చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో

-

 తెలంగాణ నిజామాబాద్ కు చెందిన సురేష్ తన భార్య, ఇద్దరు కొడుకులతో విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలంగాణలో సంచలనంగా మారింది. మరోవైపు కొత్తగూడెం పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకే మరో కుటుంబం ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందర్ని కలిచి వేసింది.

అయితే ఈ ఆత్మహత్యలకు ముందు సురేష్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అధిక వడ్డీ వేధింపుల కారణంగానే తాను మరణిస్తున్నట్లు వెల్లడించారు. అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని వెల్లడించాడు. అయితే జ్ఞానేశ్వర్‌ కు రూ. 40 లక్షల దాకా వడ్డీలు చెల్లించామని.. అయినా ఇల్లు జప్తు చేస్తామని బెదిరించాడని ఆయన సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకాలు కూడా తీసుకున్నారని.. వినకూడని భాషలో దూషించాడని అన్నారు. ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అధిక వడ్డీల కోసం గణేష్ అనే వ్యక్తి కూడా తీవ్ర వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నాడు. ఇప్పటికే గణేష్ కు రూ. 80 లక్షల దాకా చెల్లించానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జ్ఞానేశ్వర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news