వైఎస్ షర్మిల మరో వివాదస్పద ట్వీట్..కేసీఆర్ పెద్ద దొంగ అంటూ !

-

వైఎస్ షర్మిల మరో వివాదస్పద ట్వీట్ చేశారు. కేసీఆర్ పెద్ద దొంగ అంటూ ఈ ట్వీట్‌ లో వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా త్వరలో నోటిఫికేషన్లు అని దొంగ హామీలు ఇచ్చావు.లక్షా 91 వేల ఖాళీలు కాదని కొత్త లెక్కలు తేల్చాలని కమిటీలతో కాలయాపన చేశావని కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు 80వేల ఖాళీలేనని లెక్క తేల్చావని మండిపడ్డారు వైఎస్ షర్మిల.  రేపటి నుంచే భర్తీ ప్రక్రియ స్టార్ట్ అని అసెంబ్లీ సాక్షిగా అబద్దం ఆడావని మండిపడ్డారు. చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాయని హడావుడి తప్పితే ఇప్పటివరకు ఖాళీలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు.అందుకే నిన్ను నమ్మేది లేదు. నమ్మి మరోసారి మోసపోయేది లేదని విమర్శలు చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చేవరకు,ఖాళీలు భర్తీ చేసే వరకు నిరుద్యోగుల పక్షాన మా పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news