రైస్ మిల్లర్ల దగ్గరి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిర్ణయం

-

కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని ప్రకటన చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగులు చేయడం లేదని.. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని వివరించారు. రైతులు నష్ట పోతున్నారు… పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం 3నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పంపిణీ చేయడం లేదని ఫైర్ అయ్యారు.


నేను సివిల్ సప్లై అధికారుల తో మాట్లాడాను ఇంకా ఆదేశాలు రాలేదు అని అన్నారు… పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పంచడం లేదు… ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియడం లేదని నిలదీశారు. నూకలు కొంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది,కమిటీ వేసింది ఇప్పటి వరకు ఏమి కాలేదు… దేశంలోఎక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుందని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news