బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అధిష్టానాన్ని కోరుతా: కే ఏ పాల్

-

త్వరలో తాను ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుండి తీసివేయాలని అధిష్టానాన్ని కోరుతామని చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాల్ హెచ్చరించారు. అంతకు ముందు రోజు కూడా పాల్ బండి సంజయ్ ని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. వెంటనే దీనిపై బీజేపీ అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ను మరో కాశ్మీర్ లా మార్చాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు రాష్ట్రంలో కలిసిమెలిసి జీవిస్తుంటే బండి సంజయ్ వారిమధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news