పొలిటికల్ టూరిస్టులు వస్తారు, హైదరాబాద్ ధమ్ బిర్యాణీ తినిపోతారు…. రాహుల్ పై కేటీఆర్ సెటైర్లు

-

కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో మనకంటే మెరుగైన పాలన ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు.. హైదరాబాద్ ధమ్ బిర్యాణీ తినిపోతారని రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా… టీపీసీసీ, టీ బీజేపీ వచ్చేదా..? అని ప్రశ్నించారు. నిన్న వరంగల్ కు పొలిటికల్ టూరిస్ట్ వచ్చిపోయారని.. రాహుల్ గాంధీకి వడ్లు తెలియదు, ఎడ్లు తెలియదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల్లో రైతుబందు, రైతు బీమా ఉందా…? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్లిచ్చింది చదివిపోయారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల్లో రైతుల సమస్యలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతుబందు రూపంలో కేసీఆర్ ఇస్తున్న సాయం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. భారతదేశంలో ఉత్తమమైన గ్రామపంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నాయని కేంద్రమే చెబుతోందని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news