హైదరాబాద్ వాసులకు అలెర్ట్..మరో 3 రోజులు వర్షాలు !

-

రెండు తెలుగు రాష్ట్రాలపై మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. ఎక్కువగా ఆంధ్రదేశపై దీని ప్రభావం ఉన్నప్పటికీ, క్రమేపి తెలంగాణకు వ్యాపించింది. ఇక ఈ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ శివార్లలో శనివారం రాత్రి నుంచి సోమవారం వరకు వర్షం కురుస్తూనే ఉంది.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ తో పాటు, చుట్టుపక్కల జిల్లాలో కూడా నెలకొన్న చల్లటి వాతావరణానికి చీకటి మేఘాలు, అలాగే చినుకులు తోడు అయ్యాయి. వర్షం కావడంతో చాలామంది ప్రజలు ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక, ఈ మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ పై మరో మూడు రోజులు ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్నారు. మరో మూడు రోజులు ఇలాగే వర్షం కురుస్తుందని, హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news