మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో రాబోతున్నాయి – రాజాసింగ్‌

-

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో రాబోతున్నాయని పేర్కొ న్నారు రాజా సింగ్‌. సీఎం కేసీ ఆర్ కు ఛాలెంజ్ చేసి చెపుతున్నా.. మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో వస్తాయని స్పష్టం చేశారు. మంత్రులు ఎమ్మెల్యే లలో తమ పదవుల పై నమ్మకం లేదని.. ఎప్పుడు ఊడుతుందో తెలియని భయం తో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫామ్ హౌస్ నుంచి ఏరియల్‌ సర్వే దాకా కేసీఆర్‌ను గుంజుకొచ్చామని.. రాజాసింగ్‌ పేర్కొన్నారు. వరదల తో జనం గోస పడుతుంటే ఇప్పటిదాకా ఒక అంచనా వేయడం కాని, నష్ట పరిహారం ప్రకటించడం కాని చేతకాని టిఆర్ఎస్, కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర చేస్తోందని.. అన్ని కేంద్రం చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకు . ప్రభుత్వాన్ని రద్దు చేయండి BJP ఆధ్వర్యాన తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్, ప్రజలకు సుభికషమయున పాలన అందిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news