వార్నీ..ఏం తెలివిరా నాయనా..భోజనం పెట్టుకొని మరీ..

-

కరోనా పుట్టిన జన్మ స్థలం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు..ఆ విషయం పై మీడియా కథనాలు కూడా మారు మోగిపోయాయి.. ఇప్పుడు అక్కడే తీవ్రత ఎక్కువగా ఉంది..మృత్యువు గంట మోగిస్తుంది..రోజుకు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి..రోజుకి కొన్ని లక్షల కేసులు బయటపడుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మరణాలైతే లెక్కేలేదు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం అధికారిక లెక్కలు బయటకి చెప్పక పోవడం కొసమెరుపు. అందువలన అక్కడి ప్రజలను ఇప్పట్లో మాస్క్ వీడేటట్టు కనబడటం లేదు. దాంతో అక్కడి ప్రజలు కొందరు వెరైటీ ఫేస్ మాస్క్లు వాడుతున్నారు.

ఈ క్రమంలోనే పక్షి ముక్కుని పోలిన మాస్క్ లు అక్కడ తారసపడుతున్నాయి. సోషల్ మీడియా పరిధి పెరగడంతో ఇలాంటి ఘటనలు వెలువడుతున్నాయి. తాజాగా అక్కడ ఒక వ్యక్తి పక్షి ముక్కుని పోలిన మాస్క్ ఒకదానిని పెట్టుకొని రెస్టారెంట్లో భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. పేపర్తో తయారు చేసిన ఈ మాస్క్ అచ్చం పక్షిముక్కను పోలి ఉండటం విశేషం..

ఆ వీడియోను చూస్తే..ఆ వ్యక్తి తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడుగాని మాస్క్ తీయడం లేదు. నోరు తెరవడానికి వీలుగా ఉండటంతో ఆ మాస్క్ తీయాల్సిన అవసరమే లేకుండా పోయింది. వీడియో చూస్తే మీకు అర్ధమౌతుంది. సఫిర్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు కొందరు ఈ మాస్క్ ఎక్కడ దొరుకుతుంది? అని కామెంట్లు చేయడం గమనార్హం. ఎందుకంటే అది అంత బావుంది కాబట్టి. ఇకపోతే ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో చైనా ఈమధ్యే జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసింది. దాంతో అక్కడ భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 3.75 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది..ఇక చెసెదెమి లేక అధికారులు చేతులు ఎత్తేసినట్లు తెలుస్తుంది..ముందు జాగ్రత్తగా స్వీయ జాగ్రత్తలు పాటించడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news