హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..!

-

నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున మంటలు ప్రారంభం కాగా.. ఉదయం ఎనిమిది గంటల వరకు మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.

 

 

మొదట నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్‌ లో ఉన్న షాలిమార్ ఫర్నిచర్ షాప్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే పక్కనే ఉన్న ప్రదీప్ ఫర్నిచర్ షాప్‌కి మంటలు వ్యాపించాయి. దీంతో దుకాణాల్లో ఉన్న పర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. ఆస్తి నష్టాన్ని అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news