విద్యా శాఖ‌పై సీఎంజగన్‌ సమీక్ష.. మీడియా సంస్థ‌ల‌పై అస‌హ‌నం

-

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాఠ‌శాల విద్యా శాఖ‌పై స‌మీక్ష సంద‌ర్భంగా కొన్ని మీడియా సంస్థ‌ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పాఠ‌శాలల్లో చేప‌డుతున్న నాడు-నేడు, స్కూలు పిల్ల‌ల‌కు ట్యాబ్‌ల పంపిణీ, పిల్ల‌ల‌కు బైజూస్‌తో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు, విద్యా కానుక కిట్ల పంపిణీ త‌దిత‌రాల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు సీఎం జగన్‌. ఈ సంద‌ర్భంగా బైజూస్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందంపై కొన్ని మీడియా సంస్థల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌స్తావించారు సీఎం జగన్‌.

Andhra CM Jagan Mohan Reddy turns 48

మార్కెట్‌లో వేల రూపాయ‌ల ఖ‌ర్చు అయ్యే కంటెంట్‌ను ఉచితంగా విద్యార్థుల ఫోన్ల‌లోకి డౌన్‌లోడ్ చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం జగన్‌. ఇంత‌టి మంచి కార్య‌క్ర‌మంపైనా కొన్ని మీడియా సంస్థ‌లు వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో క‌థ‌నాలు రాస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం జగన్‌. విద్యా సంబంధిత కార్య‌క్ర‌మాలు, మంచి చేసే కార్య‌క్ర‌మాల‌ను కూడా రాజకీయం చేస్తుండడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news