ఢిల్లీ క్యాపిటల్ లో కరోనా కల్లోలం… మరో ఆటగాడికి కోవిడ్ పాజిటివ్

-

ఐపీఎల్ లో కరోనా కల్లోలం మొదలైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ ఆటగాళ్లు సహాయ సిబ్బంది వరసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా డీసీ టీంకు చెందిన ఓ ఫారన్ క్రికెటర్ కు కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింది. వరసగా ఆటగాళ్లు కోవిడ్ బారిన పడుతుండటంతో డీసీ టీంలో గందరగోళం నెలకొంది.

డీసీ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ తాజాగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిచెల్ మార్ష్ తో పాటు నలుగురు  సహాయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో మ్యాచ్ జరిగే వేదికను పుణే నుంచి బ్రెబౌర్న్ స్టేడియం ముంబైకి మార్చారు. తాజాగా నమోదైన కేసుతో ఈరోజు( బుధవారం) జరిగే డిల్లీ, పంజాబ్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా నమోదైన కేసుతో ఢిల్లీ క్యాపిటల్ టీంకు సంబంధించి 6గురు కరోనా బారిన పడ్డారు. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ పై కొద్ది సేపట్లో బీసీసీఐ కీలక ప్రకటనే చేస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news