జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి… పోలీస్ వాహనంపై దాడికి తెగబడ్డ టెర్రరిస్టులు…

-

మరోసారి దాడికి తెగబడ్డారు ముష్కరులు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్ ప్రాంతంలోని జెవాన్ సమీపంలో పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బంది అందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే నలుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. దీనికి అనుగుణంగానే భద్రతా బలగాలు తీవ్రవాదులపై పైచేయి సాధిస్తున్నారు. వరసగా జరిగిన ఎన్ కౌంటర్లలో తీవ్రవాదులను హతమారుస్తున్నాయి భద్రతా బలగాలు. తాజాగా ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో కూడా ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతా బలగాలు.

Read more RELATED
Recommended to you

Latest news