కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా పోయింది : మంత్రి జగదీష్‌ రెడ్డి

-

తెలంగాణలో భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ అనంతరం మీడియాతో మాట్లాడారు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి. ప్రధానికి మోదీకి సమయం దగ్గర పడిందని, వచ్చే ఎన్నికలకు గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా పోయిందని ఆయన హేళన చేశారు. ప్రజల ఎజెండాతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి అడుగుపెతున్నారని, ఎత్తుగడల్లో సీఎం కేసీఆర్‌ దిట్ట అని స్పష్టం చేశారు.

Minister Jagadish Reddy replies to ECI notice - Telangana Today

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిసినంతగా, ఏ రాష్ట్రంలో ఏ సమయంలో ఏ ఎత్తుగడ వేయాలో ఇంకొకరికి తెలియదని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సమయానుకూలంగా ఎత్తుగడలు ఉంటాయని స్పష్టం చేశారు ఆయన. అలాంటి ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సరికొత్త ఎత్తుగడలతోటే దేశ రాజకీయాల్లోకి అని ఆయన తెలిపారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి తో పాటు శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, ఎన్‌ రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్‌ భాస్కర్ రావు సమావేశానికి వచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news