రాష్ట్రంలో సైకో పాల‌న‌కి పరాకాష్ఠ : నారా లోకేశ్‌

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులకు నిర‌స‌న‌గా టీడీపీ ఎస్సీ సెల్ తలపెట్టిన ‘ఛ‌లో కావ‌లి’ కార్య‌క్ర‌మాన్ని ఉక్కుపాదంతో అణచివేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుని అరెస్టు చేసిన పోలీసులు ఎటు తీసుకెళుతున్నారో స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం రాష్ట్రంలో సైకో పాల‌న‌కి పరాకాష్ఠ అని విమర్శించారు నారా లోకేశ్. ఎంఎస్ రాజుతోపాటు అరెస్ట్ చేసిన ఉద్య‌మ‌కారులంద‌రిపై బనాయించిన త‌ప్పుడు కేసులు ఉప‌సంహ‌రించుకుని తక్షణమే విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేశారు నారా లోకేశ్.

ఇటీవల ముసునూరుకు చెందిన ఎస్సీ యువకుడు కరుణాకర్ ఆత్మహత్యకు పాల్పడగా, గతంలో పొదలకూరుకు చెందిన నారాయణ అనే దళితుడు వేధింపుల కారణంగా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కావలి తెలుగు యువత నేత పైడి హర్ష వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఇంటి ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దళితులపై వేధింపులు పెరుగుతున్నాయంటూ, ఈ ఘటనల నేపథ్యంలో టీడీపీ ఛలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. అయితే, అనంతపురం నుంచి వస్తున్న టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజును వింజమూరు సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news