ఇప్పటం బాధితులకు ఈ నెల 27 జనసేనాని ఆర్థికసాయం

-

ఏపీ రాజకీయాలు ఇప్పుడు గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే.. ఇటీవల ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో, ఈ నెల 27న పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన గ్రామం ఇప్పటం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు పవన్ కల్యాణ్. ఇప్పటం గ్రామ రైతులు జనసేన సభ ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Police Case Filed On Pawan Kalyan

అయితే, రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారని, ఆ సమయంలో గ్రామస్తులను కలుసుకున్న పవన్ వారి బాధల పట్ల చలించిపోయారని వివరించారు పవన్ కల్యాణ్. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఈ నెల 27న మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news