గ్రామాలను చీప్ లిక్కర్ అడ్డాగా మార్చిండు : రేవంత్‌ రెడ్డి

-

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ ​నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను వంచించారని రేవంత్ ​రెడ్డి మండిపడ్డారు. రూ. లక్ష రుణమాఫీ చేయకుండా మునుగోడు నియోజకవర్గంలో 30 వేల మంది రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు రేవంత్ ​రెడ్డి . ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పిండని, ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇవ్వలేదు కానీ, గ్రామాలను చీప్ లిక్కర్ అడ్డాగా మార్చిండు అని విమర్శించారు రేవంత్ ​రెడ్డి. ‘మన మునుగోడు మన కాంగ్రెస్’ నినాదంతో మునుగోడు నియోజకవర్గంలో 100 రోజుల పాటు పర్యటిస్తామని ప్రకటించారు రేవంత్ ​రెడ్డి. తెలంగాణ ఇస్తే నల్గొండ అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ భావించిందని, జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజన భూ సమస్యల పరిష్కారం, కాలుష్యనియంత్రణ వంటి అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలయిందన్నారు రేవంత్ ​రెడ్డి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఈ విషయంలో బీజేపీకి కేసీఆర్ ఆదర్శ పురుషోత్తముడని దుయ్యబట్టారు రేవంత్ ​రెడ్డి.

Revanth Reddy apologises to Komatireddy Venkat Reddy after abusive remarks  at rally | The News Minute

బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కలిసి ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్ ​రెడ్డి. ప్రజాప్రతినిధులను అంగట్లో పశువుల్లా కొంటూ విషప్రయోగాలకు ఉప ఎన్నికలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ ​రెడ్డి. మునుగోడు నియోజకవర్గానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు డిండి ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు ప్రకటించాలని రేవంత్​ రెడ్డి డిమాండ్ చేశారు రేవంత్ ​రెడ్డి. హుజూరాబాద్ లో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన వ్యక్తి మునుగోడులో ఫిరాయింపుల కమిటీ చైర్మన్​ గా ఉన్నడు. స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు రేవంత్ ​రెడ్డి. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనుకుంటే బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు రాజీనామా చేయాలని, దీనివల్ల మరో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు రేవంత్ ​రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news