కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. ముంబై లక్ష్యం 169

-

నేడు ఐపీఎల్‌ సీజన్‌ 2022లో మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 27 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 10 ప‌రుగులు చేసిన డికాక్.. బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 85 ప‌రుగుల వ‌ద్ద మ‌నీష్ పాండే(22) రూపంలో ల‌క్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ చేజార్చుకోగా, 102 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్‌ను, 103 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది.

IPL 2022: LSG VS MI Betting Tips And Players To Bet On

ఇలా ల‌క్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. అయితే ల‌క్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 103 ప‌రుగులు చేసి సెంచ‌రీతో మెరిశాడు. రాహుల్‌కు ఈ సీజ‌న్‌లో ఇది రెండో సెంచ‌రీ. ఇక ముంబై బౌల‌ర్ల‌లో మెరిడిత్‌, పొలార్డ్ చెరో రెండు వికెట్లు సాధించ‌గా.. సామ్స్, బుమ్రా త‌లా వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news