మంత్రి పువ్వాడ అజయ్ ని బర్త్ రఫ్ చేయాలి….. ఖమ్మం ఘటనపై బీజేపీ ఎంపీ బాపురావు డిమాండ్

-

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య రాజకీయంగా దుమారం రేపుతోంది. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మంత్రి పువ్వాడ అజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు (గురువారం) సాయి గణేష్ కుటుంబాన్ని బీజేపీ ఎంపీ సోయం బాపురావు పరామర్శించారు. కార్యకర్త మరణానికి కారణం అయిన మంత్రి పువ్వాడ అజయ్ ని వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేటర్ భర్తను కూడా అరెస్ట్ చేయాలని … కేసీఆర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా కార్యకర్త ఎదుగుదలను చూడలేక అతన్ని అనేక రకాలు హింసించారని… 16 కేసులు పెట్టి, రౌడీ షీట్ పెట్టి, మూడు సార్లు జైలుకు పంపి… ఆత్మహత్య చేసుకునే విధంగా ఒత్తడి చేయడం వల్లే చనిపోయారని ఆరోపించారు. సాయి గణేష్ కు ఆత్మశాంతి కలగాలంటే మంత్రి పువ్వాడతో పాటు కార్పొరేటర్ భర్తపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. చనిపోయిన తర్వాత కూడా పోలీసులు కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. అతను రికార్డ్ సెల్పీ వీడియో ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news