గాల్లో మేడలు కట్టడం.. హామీలతో కడుపు నింపడం దొరకు వెన్నతో పెట్టిన విద్య: వైఎస్ షర్మిళ

-

వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. ఇటీవల పలు సమస్యలపై స్పందిస్తున్న షర్మిళ.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ, రైతు, ధాన్యం కొనుగోలు, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వ విధానాలపై సర్కార్ ను నిలదీస్తున్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిళ పరోక్షంగా విమర్శలు చేశారు. 

ట్విట్టర్ లో ….‘‘ గాల్లో మేడలు కట్టడం,హామీలతో కడుపు నింపడం దొరకు వెన్నతో పెట్టిన విద్య. వందకు వంద శాతం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్న కేసీఆర్ గారు,ఇచ్చిన హామీని వందకు వంద శాతం ఎగ్గొట్టాడు.హామీ ఇచ్చి నాలుగేండ్లయినా ఎరువులు ఇచ్చింది లేదు. కనీసం ఎప్పుడిచ్చేది చెప్పింది లేదు.పెట్టిన పెట్టుబడి రాక ఎరువుల భారం మోయలేక, వ్యవసాయం సాగలేక రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నా, రైతును ఆదుకోరు. ఇచ్చిన హామీలు అమలు చేయరు. రైతులు పాడె ఎక్కుతున్నా సారు మాత్రం దేశాలు ఏలడానికి పక్క రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నడు. సొంతరాష్ట్ర రైతులను ఆదుకోవడం చేతకాని మీరు దేశాన్ని ఏం ఉద్దరిస్తారు దొరా??’’ అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news