ట్విట్టర్ టిల్లు… డ్రగ్స్ బానిస : బండి సంజయ్‌

-

మరోసారి మంత్రి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌. తాజాగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ టిల్లు… డ్రగ్స్ బానిస అంటూ విరుచుకుపడ్డారు బండి సంజయ్. నమూనాలిస్తే అంతా నిరూపిస్తానని… రక్త, వెంట్రుక నమూనాలిచ్చే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. ‘‘నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా…. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను రీ ఓపెన్ చేయించాల్సిందే’’ అని పట్టుబడ్డారు బండి సంజయ్. జీ-20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్   వెళ్లకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు బండి సంజయ్.

In midnight drama, police detain Bandi Sanjay on way to Munugode - The Hindu

దేశంలోని అన్ని పార్టీలు, అందరు సీఎంలు వెళ్లినా… కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో సమాధానమివ్వాలన్నారు బండి సంజయ్. ఆ సమయంలో బిడ్డను సారా దందా స్కాం నుంచి ఎట్లా కాపాడుకోవాలనే దానిపై లాయర్లతో మంతనాలు చేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ జయంతి, వర్థంతిలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డారు. అంబేద్కర్ స్పూర్తితో శక్తివంతమైన దేశంగా మార్చుతున్న గొప్ప నాయకుడు మోదీ అని బండిసంజయ్ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news