ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు : కేఏ పాల్‌

-

సీఎం కేసీఆర్ పై కేఏ పాల్ విమర్శలు చేపట్టారు. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి పాత సెక్రటేరియట్ ను కూల్చేశారని… రూ. 610 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేస్తున్నారని … ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని వ్యక్తపరిచారు . కొత్త సచివాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీబీఐకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పుట్టినరోజునే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి… కేసీఆర్ పుట్టినరోజున దాన్ని ప్రారంభించడం సరికాదని వెల్లడించారు.

ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చిమ్ముతున్నారు . ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు రేవంత్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేపట్టారు. రేవంత్ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. భూకబ్జాలు చేసి రేవంత్ ఈ స్థాయికి వచ్చారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చరిత్ర రేవంత్ దని అన్నారు. రేవంత్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం రేవంత్ ఎన్నడూ పోరాడలేదని… కాంగ్రెస్ పార్టీలో ఆయనొక జూనియర్ నేత అని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించి… బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news