కేసీఆర్ కుటుంబం తెలంగాణ రైతులను బలిచేస్తోంది : కిషన్ రెడ్డి

-

సీఎం కేసీఆర్‌ పై కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. అధికార టిఆర్ఎస్ పార్టీని చూస్తుంటే జాలేస్తుందని.. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రైతులను బలి చేస్తోందని మండిపడ్డారు. పుత్ర వాత్సల్యం తో బిజెపి పై కుట్ర చేస్తూ రైతులను ముంచుతున్నారని.. ధాన్యం కొనుగోళ్ళపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్తోందని.. రైతు పండించేది ధాన్యం మాత్రమే….రైస్ మిల్లుల్లో రా రైస్..బాయిల్డ్ రైస్ గా మారుతాయన్నారు. “రా రైస్” పంపిస్తామని అంగీకరించారు కదా..!? బిజెపి రైతు వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారన్నారు.

పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయి..కేసీఆర్ ఎందుకు పన్ను తగ్గించలేదని.. తెలంగాణ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని చెప్పారు. ఉక్రెయిన్ పరిణామాల కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల కేంద్రానికి నష్టం వస్తుందని.. సైనిక స్కూల్, ఎంఎంటీఎస్ ,ట్రైబల్ మ్యూజియం సహా కేంద్రం ఇచ్చినవాటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. కేంద్రం పై తప్పుడు ప్రచారం చేయొద్దని.. కుటుంబ రాజకీయలకోసం తెలంగాణ రైతులను బలి చేయవద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news