కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ…ట్వీట్లతోనే కాలం గడుపుతున్నాడు: లక్ష్మణ్

-

కేటీఆర్ తండ్రి చాలు బిడ్డ అని.. తండ్రి పేరు చెప్పుకుని మంత్రి పదవులు అనుభవిస్తున్నాడని విమర్శించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్. కాశ్మీర్, తెలంగాణను దేశంలో బలవంతంగా కలిపారని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావు అబద్ధాల పుట్ట అని.. అబద్ధాల్లో ఆయనకు అవార్డు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కు బీటలు వారుతున్నాయి.. టీఆర్ఎస్ పార్టీ పుట్టీ మునిగి పోతుందని అన్నారు. టీఆర్ఎస్, మజ్లిజ్ పార్టీ చెప్పుచేతల్లో పనిచేస్తుందని విమర్శించారు. విమోచన దినం జరుపుతామని అమిత్ షా అంటే మీకెందుకు కోపం వస్తుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు బావిలో కప్పల్లా తయారయ్యారని విమర్శించారు. రుణమాఫీ ఎందుకు చేయలేదంటే మీ కడుపు మండుతుందని అన్నారు. ఓ మంత్రి ట్వీట్లతోనే కాలం గడుపుతున్నాడని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు అయినా ముంబాయి, దుబాయ్, బొగ్గు బావిగా తెలంగాణ బతుకులు మారిపోయాయని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ తోనే ఉంటారని లక్ష్మణ్ అన్నారు. ప్రవీణ్ కుమార్, షర్మిల, కోదండరాం, మందకృష్ణ లు కేసీఆర్ ను ఓడించేందుకు ఓట్లు చీలకుండా చూడాలని కోరారు లక్ష్మణ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news